SSB జవాన్లకు కరోనా
SSB జవాన్లకు కరోనా
దిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా మరో ఎనిమిది మంది సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) జవాన్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరంతా దిల్లీలోని పలు ప్రభుత్వ సంస్థల వద్ద భద్రతాసంబంధమైన విధుల్లో ఉన్నారు. ఈ ఎనిమిది కేసులతో కలిపి ఎస్ఎస్బీలో కరోనా బారిన పడినవారి సంఖ్య 13కి పెరిగింది. ఇది ఇలా ఉండగా భారత దేశంలో గడిచిన 24గంటల్లో 2573 కొత్త కేసులు, 83 మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది .
Comments
Post a Comment