నల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ
నల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ అమలాపురం కొంకాపల్లి హరిమనో వికాస కేంద్రంలోని దివ్యాంగులకు బుధవారం నల్లా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ కు మందు లేదని, భౌతిక దూరం పాటిస్తూనే జాగ్రత్త వహించాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోకరకొండ గంగన్నస్వామి, పెద్దిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.