Posts

రామరక్షా స్తోత్ర పారాయణ నిర్వహణ

Image
రామరక్షా స్తోత్ర పారాయణ నిర్వహణ అన్నవరం: ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో బుధవారం శ్రీరాముని ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగనున్న సందర్భంగా స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రామరక్షా స్తోత్ర పారాయణ నిర్వహిస్తున్నట్లు పారాయణ బృందం కన్వీనర్ యడవిల్లి ప్రసాద్ తెలిపారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు భక్తులు ముఖాలకు మాస్క్ లను ధరించి, ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని  కోరారు.

మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎక్సైజ్ సూపరింటెండెంట్

Image
మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎక్సైజ్ సూపరింటెండెంట్      బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాల్ ను రామచంద్రపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్  వీ. నాగేశ్వర రావు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. మొక్కను బహూకరించి మంత్రికి అభినందనలు తెలియజేశారు. ఈ  కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు గుబ్బల యేసురాజు, కుక్కల శ్రీను పాల్గొన్నారు.

కంప్యూటర్ ను అందజేసిన జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ

Image
కంప్యూటర్ ను అందజేసిన జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ   సీతానగరం : సీతానగరంలోని లంకూరు పాఠశాలకు జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ కంప్యూటర్ ను మంగళవారం అందజేసింది. ఈ సందర్భంగా ఎంఇఒ కె.స్వామినాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్ఎం పొలినాటి ఈశ్వరుడు మాట్లాడారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను మెరుగు పర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం పి.సుశీల ఎం.వసంతరావు, ఎం.పాపారావు తదితరులు పాల్గొన్నారు.