రామరక్షా స్తోత్ర పారాయణ నిర్వహణ
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEihDQQPNR2yKiY8Q8y6Fu262Fa-K84NT3Fj7v_8ExxYUpsqcFd3bKqaLhc3T6DCL-DV09NmhHq61piF7gLvRAT-hvx9V4rqertmAQSj5UJ4p5EHapjSnzjFE-RQ6MRvg4DLglq8j9Dll4w/s1600/1596584842872595-0.png)
రామరక్షా స్తోత్ర పారాయణ నిర్వహణ అన్నవరం: ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో బుధవారం శ్రీరాముని ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగనున్న సందర్భంగా స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రామరక్షా స్తోత్ర పారాయణ నిర్వహిస్తున్నట్లు పారాయణ బృందం కన్వీనర్ యడవిల్లి ప్రసాద్ తెలిపారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు భక్తులు ముఖాలకు మాస్క్ లను ధరించి, ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరారు.